ఇంటింటి రేషన్కు హైకోర్టు ఓకే కాని, ఎస్ఈసీకి తెలియజేయాలని స్పష్టం
అమరావతి: ఆంధప్రదేశ్ సర్కారుకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు లోబడే ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించింది. అంతేగాక, ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండదరాని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఏపీ సర్కారు గతంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ రేషన్ పంపినీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పంపిణీకి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది.
ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్ వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యక్రమ వివరాలతో రెండు రోజుల్లో ఎస్ఈసీని సంప్రదించాలని తెలిపింది.
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని ప్రభుత్వం కోర్టుకు వివరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదు రోజుల్లో నిర్ణయం తెలపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటికే రేషన్ సరుకులు అందించాలని
కాగా, రేషన్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9260 వాహనాలను జనవరి 21న ప్రారంభించింది. ఈ వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు కేటాయించింది. ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాలను అందించింది. ఇప్పటికే వాహనాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు చేరాయి.