Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాపు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక సూచన - ఒత్తిడి తెండి..!!

కాపు రిజర్వేషన్ల పై కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హైకోర్టు సూచించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎ్‌స)కు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతంకోటా అమలు కోసం దాఖలైన వ్యాజ్యాల విచారణ వేళ హైకోర్టు ఈ సూచన చేసింది. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో రిజర్వేషన్‌ అమలును సర్కారు జాప్యం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.

పిటీషనర్లకు కోర్టు సూచనలు:కొంత కాలంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎ్‌స)కు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతంకోటా అమలు చేస్తూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశం పైన మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు పిటీషనర్లకు కీలక సూచనలు చేసింది. పిటిషన్లను ఉపసంహరించుకుని వేరే విధంగా దానిపై ఒత్తిడి తీసుకురావాలని పిటిషనర్లకు సలహా ఇచ్చింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది.

AP high Court key Directions for petitioners on Implementation

కాపులకు 5 శాతం రిజర్వేషన్:కాపులకు రిజర్వేషన్ అమలు కోసం, అదే సమయంలో వాటిని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో లోతైన విచారణ చేకయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటీషన్లలో ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మాజీ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంలోనే మరి కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించిందని పిటీసణర్ల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

కౌంటర్ దాఖలుకు ఆదేశం:మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు తన వాదనలు వినిపిస్తూ ఈడబ్ల్యూఎస్ పది శాతం కోటాలో ఒకే సామాజిక వర్గానికి అయిదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేసామని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ తన వాదనల్లో భాగంగా కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావాలని కోరారు. ఈ వ్యవహారంలో కీలక అంశాలు ఉన్నాయని నివేదించారు. దీని పైన లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో, న్యాయస్థానం ఈ కేసును వాయిదా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+