వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మృతి, విధులు నిర్వహిస్తుండగా అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
ఆంధప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతి చెందారు. బుధవారం హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆయన కుప్పకూలిపోవడంతో హుటాహుటిన విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందని సహచరులు తెలిపారు.
Recommended Video
Railway
ప్రయాణీకులకు
గుడ్న్యూస్..
రద్దైన
టిక్కెట్ల
డబ్బులు
Refund
!
||
Oneindia
Telugu
రాజశేఖర్ మృతి పట్ల ఏపీ హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. రాజశేఖర్ ప్రస్తుతం ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇటీవల మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్గా నియమించిన సంగతి తెలిసిందే. మహిళా అధికారి చార్జ్ తీసుకున్న మరునాడే రాజశేఖర్ చనిపోయారు. రాజశేఖర్ తమతో సఖ్యతతో ఉండేవారు, మంచి మనిషి అని.. ఆయన లేని లోటు పూడ్చలేము అని సిబ్బంది అంటున్నారు.
Comments
andhra pradesh highcourt rajashekar dead office ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజశేఖర్ మృతి గుండెపోటు కన్నుమూత కార్యాలయం
English summary
andhra pradesh highcourt register general rajashekar dead due to heart stroke in office
Story first published: Wednesday, June 24, 2020, 16:48 [IST]