ఏపీలో పెట్రోల్ పోయిస్తున్నారా ? బంకుల్లో చిప్ గమనించారా - తమిళనాడు చిప్లతో మోసాలు..
ఏపీలో పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా మోసాలు బయటపడుతున్నాయి. చిప్ల సాయంతో పెట్రోల్ బంకుల యజమానులు తక్కువ ఇంధనాన్ని నింపుతూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న వైనం బయటపడింది. తాజాగా జరుగుతున్న తనిఖీలను బట్టి చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి చిప్లను తీసుకొ్చి పెట్రోల్ మీటర్లకు బిగించి యజమానులు మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

పెట్రోల్ బంకుల మోసాలు..
ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేలాది పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో తూనికలు, కొలతలశాఖ అధికారులు తాజాగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. బంకుల్లో పెట్రోల్ ధర ఎంత ఉంది, తీసుకుంటున్న మొత్తానికి తగినంత పెట్రోల్, డీజిల్ వాహనాల్లో నింపుతున్నారా లేదా అనే అంశాలపై వివిధ నగరాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో వారికి దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. వీటి ఆధారంగా పలువురు పెట్రోల్ బంకుల యజమానులను అరెస్ట్ చేసిన అధికారులు బంకులను సీజ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ మోసాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తారా లేక ఎప్పటిలాగే వీరిపై నామమాత్రపు కేసులతో సరిపెడతారా అన్నది తేలాల్సి ఉంది.

మీటర్లలో చిప్లు అమర్చి మోసాలు...
పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు రౌండ్ ఫిగర్ లేదా లీటర్లలో పెట్రోల్ కొట్టించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే తాము చెల్లించిన డబ్బుకు తగినంత ఇంధనం నింపుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకునే తీరిక, ఓపిక వినియోగదారులకు ఉండటం లేదు. ఇంధనం నాణ్యత పరీక్షించుకునేంత సమయం ఎవరికీ ఉండడం లేదు. ఇదే అదనుగా పెట్రోల్ బంకుల యజమానులు మోసాలకు తెరలేపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చిప్లను మీటర్లలో అమర్చి మీటర్ తిరుగుతున్నట్లే కనిపిస్తూ పెట్రోల్ లేదా డీజిల్ తక్కువగా వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారికి ఇంధనం ఆదా అవుతుంది. వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది.
తాజాగా తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో ఇలాంటి చిప్ వాడకం దాదాపుగా అన్నిచోట్లా జరుగుతుందని తెలుస్తోంది.
Recommended Video

లీటరుకు 40 ఎంఎల్ మోసం..
ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయంగా కూడా పెట్రోల్ ధర లీటరుకు 90 రూపాయల దగ్గర్లో ఉంది. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకున్నా నెలకు లక్షల రూపాయలు మిగిలే అవకాశముంది. దీంతో పెట్రోల్ బంకుల్లోని మీటర్లలో చిప్లను అమర్చడం ద్వారా పెట్రోల్ బంకుల యజమానులు లీటరు ఇంధనానికి కనిష్టంగా 40 ఎంఎల్ మిగుల్చుకుంటున్నారని తాజా తనిఖీల్లో తేలింది. తాజాగా చిత్తూరులో ఇలా చిప్స్ అమర్చి వినియోగదారులను దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని వేలూరు నుంచి ఈ చిప్లను తీసుకొచ్చి బిగిస్తున్నట్లు విచారణలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులకు ఇదే విధంగా చిప్లు అమర్చి ఉన్నట్లు చిత్తూరు బంకు యజమాని విచారణలో తెలిపాడు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మిగిలిన బంకులపై దాడులు నిర్వహిస్తున్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications