ఆర్ధిక నేరగాడితో మేం ఎలా కలుస్తాం: కాలువ శ్రీనివాసులు
అమరావతి:ఆర్థిక నేరగాడితో తాము ఎలా కలిసి పనిచేస్తామని ఏపీ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు. తనతో కలిసి పనిచేయాలని వైసీపీ చీప్ వైఎస్ జగన్ ప్రకటించడాన్ని చూస్తే నవ్వాలో ఏడ్వాలో కూడ అర్ధం కావడం లేదన్నారు మంత్రి కాలువ శ్రీనివాసులు.
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ టిడిపి ఎంపీలు కూడ తమ పార్టీలతో కలిసి రాజీనామాలు చేయాలని ఫిబ్రవరి 15వ, తేదిన నెల్లూరు జిల్లాలో కోరారు.
జగన్ ప్రకటనపై మంత్రి కాలువ శ్రీనివాసులు శుక్రవారంనాడు స్పందించారు . ఆర్థిక నేరచరిత్ర ఉన్న జగన్తో తాము ఎలా కలిసి పనిచేస్తామని మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జెఎఫ్సి సమావేశంలో పాల్గొన్న వారికి మంత్రి కాలువ శ్రీనివాసులు స్వాగతం చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేసేందుకు ముందుకు వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నట్టు ఆయన చెప్పారు.
పవన్ కళ్యాణ్ రాతపూర్వకంగా సమాచారం అడగలేదన్నారు. పవన్ కళ్యాణ్ రాతపూర్వకంగా సమాచారం అడిగితే ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కు ఇచ్చినట్టు కాలువ శ్రీనివాసులు గుర్తు చేశారు.