రాజధానిపై కమిటీకి ప్రభుత్వం అభిప్రాయం, గుంటూరేనా
హైదరాబాద్: రాజధాని పైన ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ మంగళవారం భేటీ అయ్యారు. రాజధాని ఏర్పాటు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని ఆయన శివరామకృష్ణన్ కమిటీకి ఈ రోజు తెలియజేశారు.
ఏపీ ప్రభుత్వం గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. నారాయణతో పాటు ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కమిటీతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ త్వరలో కేంద్రానికి నివేదిక అందించనుంది.

కాగా, అంతకుముందు రోజు (సోమవారం) నారాయణ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాట్లాడారు. నూతన రాజధాని ఎంపికకు సంబంధించి శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆగస్టు 15లోపు వస్తుందని తెలిపారు. తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజధాని సలహా కమిటీ సింగపూర్, మలేషియా, చైనా, దుబాయ్, చండీఘడ్, గాంధీనగర్ ప్రాంతాలలోని రాజధానులను పరిశీలించి నూతన రాజధానిపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. కృష్ణ, గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయన్నారు. 22న ఢిల్లీలో శివరామకృష్ణ కమిటీతో సమావేశమై రాష్ట్ర పునర్విభజన బిల్లులో పొందుపరచిన విషయాలపై చర్చిస్తానని పేర్కొన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications