'జగన్ ఓర్వలేకే': మోహన్ బాబు చెప్తే.. ముద్రగడను కలిసిన హీరో విష్ణు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు బుధవారం నాడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తుతున్నారు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని కోట్లకు కోట్లు పెంచింది వైయస్ రాజశేఖర రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కోట్లు దండుకున్న జగన్ ఇప్పుడు మాపై నిందలు వేయడం సరికాదన్నారు.
జగన్ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. తాత్కాలిక సచివాలయంపై విపక్షాల ఆరోపణలు సరికాదని మంత్రి నారాయణ చెప్పారు. జూన్ నెల నాటికి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఏపీకి వస్తారని చెప్పారు.

తాత్కాలిక సచివాలయం రెండేళ్ల పాటు ఉంటుందని, ఆ తర్వాత ఆ భవనాన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటామని అభిప్రాయపడ్డారు. జగన్ తన అక్రమాస్తులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రం కోసం ఆలోచించడం లేదన్నారు. జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న జగన్ కడపకు ఏం చేశారన్నారు.
ముద్రగడను కలిసిన మంచు విష్ణు
ప్రముఖ నటుడు మంచు విష్ణు బుధవారం సాయంత్రం కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. తన తండ్రి పంపితే వచ్చానని ఆయన చెప్పారు. విష్ణు తండ్రి, నటుడు మోహన్ బాబు ఫోన్ చేసి ముద్రగడను పరామర్శించారు.
కాశ్మీర్ భారత్లో భాగం: వెంకయ్య
కాశ్మీర్ ముమ్మాటికి భారత దేశంలో భాగమేనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో అన్నారు. దేశ ద్రోహులకు విశ్వవిద్యాలయాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పార్లమెంటు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విపక్షాలు లేవనెత్తే అంశాల పైన చర్చకు తాము సిద్ధమని చెప్పారు. విద్యార్థుల ముసుగులో కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వెంకయ్య ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉద్దేశించి మండిపడ్డారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications