ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేయనున్న బాబు..! రెండు స్థానాలపై ఉత్కంఠ..!!
అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రేదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఒకటి, అధికార టీడీపీ పక్షానికి నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉంది. బుధవారం చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.

ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరపున ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే అవకాశం ఉన్నది నాలుగు స్ధానాలే అయినా ఆశావాహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అకోశ్ బాబును ఎమ్మెల్సీ చేస్తానని ఆయన పదవీ విరమణ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రకటించారు. ఇక ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వక తప్పదు. మిగిలిన రెండు స్ధానాలకు ఎవరిని ఎంపిక చేస్తారో అని టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications