AP Panchayat Election: ముగిసిన మూడవ విడత పోలింగ్.. కౌంటింగ్ ప్రారంభం
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆరంభం అయ్యాయి. సరిగ్గా తెల్లవారు జామున 6:30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఈ విడతలో మొత్తం 3,221 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. అందులో 579 చోట్ల ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. మిగిలిన 2,640 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది.
అలాగే- 33,570 వార్డులకు 12,604 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 19,533 వార్డులకు ఎన్నికలు చేపట్టారు.ఇక పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన తర్వాత ఉపసర్పంచి ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారులు వివరించారు.

మొత్తం 26,851 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు అధికారులు. 47,492 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 4,118 పంచాయతీలను సమస్యాత్మకమైనవిగా 3,127 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 7,757 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం, 43,162 మంది వార్డు సభ్యుల కోసం పోటీ పడుతోన్నారు. పోలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం అప్డేట్..












Click it and Unblock the Notifications