తీరానికి సమీపించిన తుఫాన్- ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీరానికి సమీపించింది. తమిళనాడు ఉత్తరం ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో ఈ మూడు చోట్లా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించింది.
శ్రీలంక తీరం, దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన దిత్వ తుఫాను.. నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. శ్రీలంకలోని ట్రింకోమలికి పశ్చిమ-నైరుతి దిశలో 30, బట్టికలోవాకు వాయువ్య దిశలో 120, తమిళనాడులోని కారైకల్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 300, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 410, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయ దిశలో 510 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుఫాను శ్రీలంక తీరం, బంగాళాఖాతం నైరుతి- వాయువ్య దిశలో కదులుతోంది. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ ప్రాంత తీరాలకు మరింత చేరువ కానుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నేడు- చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అలాగే ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం నాడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ అయింది. వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతాయి.
అదేవిధంగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాన్.. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబండి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వీటి తీవ్రత క్రమంగా 70 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం నుండి గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 1 వరకు దక్షిణ ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications