శారదాపీఠంలో ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగం-శ్రీనివాసానంద సరస్వతి వార్నింగ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పరపతిని వాడుకుని తిరుమలలోని శారదాపీఠంలో చేపట్టిన నిర్మాణాలపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర అభ్యతరం తెలిపారు. ఇవాళ వాటిని పరిశీలించిన ఆయన.. అక్రమణలను కూల్చకపోతే ప్రాణత్యాగం చేసుకుంటానని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే శారదాపీఠం విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరున్న స్వరూపానంద దీన్ని నిర్వహిస్తున్నారు.
విశాఖలోని శారదా పీఠానికి అనుబంధంగా తిరుమలలో నిర్మించిన శారదాపీఠంపై సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగం చేసుకొంటానన్నారు. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చారని విమర్శించారు. ఇక్కడ ఒక్కరికీ అన్నం పెట్టడం లేదన్నారు. అలాగే పూజలు చేయడం లేదన్నారు.

తిరుమల శారదా పీఠానికి 4 అంతస్తులకు అనుమతి ఇస్తే 6 అంతస్తుల నిర్మాణం చేపట్టారని శ్రీనివాసానంద ఆరోపించారు.గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 10వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారని కూడా ఆరోపించారు. వీటిని ప్రభుత్వం కూల్చేయాలని ఆయన కోరారు. లేకపోతే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications