ట్యాపింగ్ శిక్షణకు ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు ట్యాపింగ్ విషయమై చెక్ రిపబ్లిక్లో శిక్షణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే, ఇది అధికారికమే. చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ పైన శిక్షణలో వారు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
రిమోట్ ట్యాపింగ్ తదితరాల పైన అవగాహనకు హాజరైనట్లుగా తెలుస్తోంది. మే 30, 2015న పలువురు అధికారులు జూలై 2 నుండి జూలై 4వ తేదీ వరకు చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్లో జరిగిన 'ఇంటెలిజెన్స్ సపోర్ట్ సిస్టమ్ వరల్డ్ యూరోప్ కాన్ఫరెన్స్ కమ్ ఎక్స్ పో, ఫర్ లా ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీస్'కు హాజరయ్యేందుకు తెలంగాణ అనుమతించింది.

అలాగే, ఏపీ ప్రభుత్వం కూడా మే 29వ తేదీన పలువురు అధికారులకు అదే కాన్ఫరెన్సుకు హాజరయ్యేందుకు అనుమతించింది. ఇలాంటి శిక్షణ కోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు మార్చిలో దుబాయిలో హాజరైనట్లుగా తెలుస్తోంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో, ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటుకు చెందిన పలువురు అదికారులు 2008, 2014లో ఐఎస్ఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ పోకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మధ్య ట్యాపింగ్, ఓటుకు నోటు రగడ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications