పర్యాటక శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగుల బైఠాయింపు....డిమాండ్లు నెరవేర్చాలని హెచ్చరిక

తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఎపి పర్యటక శాఖ ఉద్యోగులు విజయవాడ ఆటోనగర్ లోని పర్యాటక శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అమరావతి: విజయవాడ ఆటో నగర్ లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయం ఎదుట ఆ శాఖ ఉద్యోగులు బైఠాయింపు జరిపారు. కృష్ణా నదిలో

పడవ ప్రమాదం తర్వాత పర్యాటక శాఖ చేసిన పలు సస్పెషన్లకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారు. అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు.

AP tourism department employees holding protest

పర్యాటక శాఖ ఉద్యోగుల డిమాండ్లివి. పర్యాటక శాఖలో

కన్సల్టెంట్లను రెగ్యులర్ విధుల నుంచి తక్షణమే తొలగించాలి,

ఉద్యోగుల బలవంతపు బదిలీలు నిలిపివేయాలి,

అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలి,

పిఆర్సి బకాయిలు వెంటనే విడుదల చేయాలి,

హెబిఏ వెయికల్ లోన్లు మంజూరు చేయాలి,

ఎస్సీ,ఎస్టీ ఖాళీలు భర్తీ చేయాలి,

జివో138 అమలు చేయాలి,

ఈడిని వెంటనే మాతృ సంస్థకు బదిలీ చేయాలి,

అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి‌

,కారుణ్య నియమకాలు చేపట్టాలి...ఈ డిమండ్లను నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని పర్యటక శాఖ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+