పట్టిసీమకు వ్యతిరేకం: నీళ్లివ్వకుంటే తలలు ఎక్కడ పెట్టుకుంటారన్న రఘవీరా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు, తెలుగుదేశం, బీజేపీ వ్యతిరేకమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పట్టిసీమ ప్రత్యామ్నాయమని, 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తే పట్టిసీమ ఎందుకో సీఎం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

వచ్చే నెలలోపు పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వకుంటే తెలుగుదేశం నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుతం బతుకు, సీఎం చంద్రబాబు జాతకం కుడా ఇంకుడు గుంతేనని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య, చంద్రబాబు నేరస్థులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఈ నెల 7,8,9 తేదీల్లో అన్ని పోలీస్స్టేషన్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని రఘవీరా చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications