APPSC : ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది.ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం(ఏప్రిల్ 28) ప్రకటించింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.psc.ap.gov.inలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఉంచారు. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూలకు సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్స్ కూడా అందుతాయి. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వయసు,విద్యార్హతలు,స్టడీ సర్టిఫికెట్,రెసిడెన్సీ సర్టిఫికెట్,లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు,డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది.

కాగా,2018లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయగా డిసెంబర్,2020లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది.రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్లో ఉన్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications