APPSC : ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది.ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం(ఏప్రిల్ 28) ప్రకటించింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.psc.ap.gov.inలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఉంచారు. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూలకు సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్స్ కూడా అందుతాయి. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వయసు,విద్యార్హతలు,స్టడీ సర్టిఫికెట్,రెసిడెన్సీ సర్టిఫికెట్,లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు,డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది.

కాగా,2018లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయగా డిసెంబర్,2020లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది.రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్లో ఉన్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications