ఎంబీయే అంటే చెప్పలేనివారు..: అమెరికా ఇమ్మిగ్రేషన్ ఇష్యూపై కేంద్రమంత్రి అశోక్
విజయనాగరం: అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలనే ఎంచుకోవాలని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక గజపతి రాజు ఆదివారం సూచించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.
ముందుగానే విద్యా సంస్థను ఎంపిక చేసుకుని వెళ్లాలి తప్ప, అక్కడికు వెళ్లి ఎంపిక చేసుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. విద్యార్థులను తీసుకెళ్లి తీసుకురావడం వరకే భారత విమానయాన శాఖ బాధ్యత అని చెప్పారు.

అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఎదురౌతున్న ఇబ్బందులను విదేశాంగ శాఖ, సంబంధిత మంత్రి సుష్మా స్వరాజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంబీఏ అంటే ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన వారు ఉద్యోగాలకు ఎలా అర్హులు అవుతారని అశోక గజపతి రాజు ప్రశ్నించారు.
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు చెందిన పలువురు విద్యార్థులను అమెరికా అధికారులు విమానాశ్రయం నుంచే వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా పద్దెనిమిది మంది విద్యార్థులను న్యూయార్క్ నుంచి తిప్పి పంపారు.
-
ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి కోటి డాలర్లు -
ఖమేనీ ప్రాణాలతో లేడనే మాట వింటున్నా- ఇరాన్ సరెండర్ కావడం బెటర్: ట్రంప్ -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!!












Click it and Unblock the Notifications