ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు...
ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టాటా-ఎర్నాకుళం-టాటా మధ్య ప్రత్యేక రైళ్లు తీసుకరానున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం త్రిపాఠి ప్రకటించారు. ఫిబ్రవరి 5, 12 తేదీల్లో టాటా- ఎర్నాకుళం(08189) ప్రత్యేక రైలు తెల్లవారుజామున 5.15 గంటలకు టాటాలో బయలుదేరి అదే రోజు రాత్రి 8.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి 8.45 గంటలకు బయలుదేరి వెళుతుంది. ఫిబ్రవరి 8,15 తేదీల్లో ఎర్నాకుళం-టాటా(08190) ప్రత్యేక ట్రైన్ ఉదయం 7.15 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరుతుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు.
మరో రెండు రైళ్ల సమయాల్లో తాత్కాలిక మార్పులు చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో రెండు రైళ్ల బయలుదేరే సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి వివరించారు. ఈ నెల 2న ఉదయం పది గంటలకు వెళ్లే చెన్నై సెంట్రల్- భువనేశ్వర్(12829) రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరనుంది. ఉదయం పది గంటలకు బయలుదేరే పురులియా-విల్లూపురం(22605) ఎక్స్ప్రెస్ 6 గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుంది. అంటే ఉదయం 10కి బయలుదేరాల్సిన ట్రైన్ సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారి తెలిపారు.

ఆయా తేదిల్లో విశాఖ టు గుణుపూర్ వెళ్లే ట్రైన్ రద్దు : ఇక, ఈ నెలలో విశాఖ టు గుణుపూర్ వెళ్లే ట్రైన్ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 25, 28 తేదీల్లో విశాఖ - గుణుపూర్ - విశాఖ (08522-08521) రైళ్లను ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఆయా తేదిల్లో గుణుపూర్-రూర్కెలా రాజ్యరాణి ఎక్స్ప్రెస్ పలాస-రూర్కెలా మధ్య మాత్రమే నడుస్తుందని ఆయన అన్నారు. ఆ తేదిల్లో ప్రయాణించేవారు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications