జనసేనలో చేరిన అవనిగడ్డ, పాలకొండ అభ్యర్ధులు.. !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఓ పార్టీలో టికెట్లు లభించని వారు ప్రత్యర్ధి పార్టీల్లోకి ఫిరాయించడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మిత్రపక్షాల్లోకి సైతం ఫిరాయించేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీలో టికెట్లు ఆశించి అవి దక్కకపోవడంతో కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న ఇద్దరు నేతలు ఇవాళ జనసేన పార్టీలో చేరిపోయారు. వీరిలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో పాటు పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ ఉన్నారు.
మాజీ టీడీపీ నేతలు మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చిన వీరిద్దరూ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. వీరితో పాటు వీరి అనుచరులు, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీతోనే వీరిద్దరూ జనసేనలో చేరినట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరి పేర్లను అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు ప్రకటించనున్నారు. దీంతో జనసేన జాబితా పూర్తవుతుంది.

టీడీపీలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ కు తాజాగా ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆ తర్వాత ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించేసింది. దీంతో ఆయన మరో పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఆయన వ్యూహాత్మకంగా జనసేనను ఆశ్రయించి అక్కడి నేతల్ని కాదని తనకు టికెట్ తెచ్చుకుంటున్నారు. అలాగే పాలకొండలోనూ స్ధానిక జనసేన నేతల్ని కాదని టీడీపీ నేత నిమ్మక జయకృష్ణను తెచ్చి పవన్ టికెట్ కేటాయిస్తున్నారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications