'మాకంటే చంద్రబాబు మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇలానా', రోజా తీవ్ర ఆగ్రహం
అమరావతి: కేంద్రం ఇచ్చిన నిధులు ఇవీ అంటూ లెక్కలు చెబుతూ, టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలకు మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు మంగళవారం కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాయకులు తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా బీజేపీతో కలిసే ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

వాటిని నిరూపించాలి
చంద్రబాబు పైన, ప్రభుత్వం పైన చేసే అవినీతి ఆరోపణలు సరికాదని అయ్యన్న అన్నారు. అవినీతి ఆరోపణలు చేసే వారు మొదట వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆయన బీజేపీ నాయకులు విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల పైన కూడా స్పందించారు.

విష్ణుకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు కూడా ఇవ్వరు
విష్ణు కుమార్ రాజుది చిన్న పిల్లవాడి మనస్తత్వమని అయ్యన్న అన్నారు. విష్ణు కుమార్ రాజుకు ఇచ్చిన ప్రాధాన్యత తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు కూడా ఇవ్వరని వాపోయారు. అలాంటి విష్ణు టీడీపీపై విమర్శలు సరికాదన్నారు.
Recommended Video


చంద్రబాబుపై ఎమ్మెల్యే విమర్శలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై వేరుగా నిప్పులు చెరిగారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు తనపై ఉన్న కేసుల భయంతో ప్రత్యేక హోదాను సమాధి చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ విషయంలో టీడీపీ ఎంపీలు ఒకరకంగా, ఎమ్మెల్యేలు మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు.

టీడీపీ - బీజేపీ వాగ్యుద్ధం
కాగా, బడ్జెట్ అనంతరం టీడీపీ, బీజేపీ మధ్య వాగ్యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఏపీకి అన్యాయం జరిగిందని, అలాగే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇవ్వలేదని టీడీపీ మండిపడుతుండగా, తాము హామీలను నెరవేర్చుతున్నామని బీజేపీ చెబుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications