చంద్రబాబుపై లండన్ లో నిఘా ? షాకింగ్ రీజన్ ..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఓ బాంబు పేల్చారు. గతంలో తాను లండన్ వెళ్లినప్పుడు జరిగిన ఓ పరిణామాన్ని ఆయన బయటపెట్టారు. లండన్ మ్యూజియాన్ని తాను సందర్శించినప్పుడు ఆయనపై ఎలా నిఘాపెట్టారో చంద్రబాబు తాజాగా వివరించారు. విజయవాడలో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ లో పాల్గొన్న చంద్రబాబు చెప్పిన ఈ విషయం చర్చనీయాంశంగా మారుతోంది.
సీఎం చంద్రబాబు గతేడాది లండన్ పర్యటనకు వెళ్లారు. ఏపీకి పెట్టుబడులు సాధించేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీలు అయ్యారు. మధ్యలో లండన్ మ్యూజియానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే కోహినూర్ వజ్రం కూడా ఉంది. దీంతో అక్కడికి వచ్చే వారిపై ఎలాగో నిఘా ఉంటుంది. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా నిఘా పెట్టారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ కోహినూర్ వజ్రాన్ని తాను ఎక్కడ అడిగి తీసుకెళ్లిపోతాననే తనపై నిఘా పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు.

దీంతో లండన్ పర్యటనలో కోహినూర్ వజ్రం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన, లండన్ మ్యూజియం సందర్శనకు వెళ్దామనుకుంటే తనను అనుమతించలేదని, తాను వెళ్తే కోహినూర్ వజ్రం అడుగుతానని వారికి భయం అని సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా "తానే క్లీన్ కోహినూర్ డైమండ్" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతకీ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. మన ఘనమైన వారసత్వ సంపదకు కోహినూర్ డైమండ్ ఓ చిహ్నమని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా వీటి ప్రత్యేకతను వివరిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు.
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications