ఎన్టీఆర్ ఇలాకాలో వైయస్ జగన్కు చేదు అనుభవం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని స్వర్గీయ ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చేదు అనుభవం ఎదురైంది. అత్యంత గోప్యంగా నిమ్మకూరు చేరిన జగన్ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీ రామారావు అభిమానులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.
జగన్ పూలమాల వేస్తే తాము ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో జగన్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాగా, జగన్ ఎన్టీ రామారావు బంధువు నందమూరి పెద వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లారు. తమ పార్టీలో చేరాలని జగన్ పెద వెంకటేశ్వర రావును కోరారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులతో నందమూరి పెద వెంకటేశ్వర రావుకు విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని వాడుకోవడానికి వైయస్ జగన్ సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైయస్ జగన్ నిమ్మకూరు పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు.
అయితే, జగన్ నిమ్మకూరు వచ్చినట్లు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక్కసారిగా గుప్పుమంది. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున నిమ్మకూరు వచ్చారు. చిగురుపాటి బాబూరావు కుటుంబ సభ్యులకు మాత్రమే జగన్ రాక గురించి తెలుసునని అంటున్నారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications