Disha case.. encounter నిందితుల ఎన్కౌంటర్ పై బాలకృష్ణ ... భగవంతుడే పోలీసుల రూపంలో అంటూ
Recommended Video
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. ఇప్పుడు దేశం మొత్తం దీనిపైన చర్చిస్తుంది. మెజారిటీ ప్రజలు పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని, అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్ధిస్తున్నారు. ఇక సినీ వర్గాలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై తమ స్పందన తెలియ చేస్తున్నారు.

ఎన్కౌంటర్ పై స్పందిస్తున్న సినీ ప్రముఖుల వ్యాఖ్యలు వైరల్
ఇక ఈ ఎన్కౌంటర్ పై సినీ ప్రముఖుల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సహా మంచు మంచు మనోజ్, నేచురల్ స్టార్ నాని స్పందించారు. దర్శకుడు హరీష్ శంకర్ తన బాణి వినిపించారు. నిందితులను ఎన్కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్ల ను దాచుకోవాలని ఉందని.. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని మంచు మనోజ్ అన్నారు. ఎన్కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నారు.

మంచి పంచ్ ఉన్న పోస్టులు పెడుతున్న సెలబ్రిటీలు
నలుగురు చచ్చారనే వార్త లో ఇంత కిక్కు ఉందా? అంటూ మనోజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవల మనోజ్ దిశ కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా ఎన్ కౌంటర్ పై నాని స్పందించారు. ``ఊర్లో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసై ఉండాలి`` అంటూ నాని ట్విట్ చేశారు.

స్పందించిన సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
ఇక హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడు. దిశ ఆత్మ కు ఇప్పుడు శాంతి చేకూరింది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీసులకు.. తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. సమాజాన్ని మార్చడానికి అప్పట్లో తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా మంచి సందేశాలను ఇచ్చారని బాలయ్య పేర్కొన్నారు.

భగవంతుడే పోలీసుల రూపంలో శిక్షించాడని చెప్పిన బాలకృష్ణ
తాను కూడా లెజెండ్ వంటి సినిమాల్లో స్త్రీల గొప్పదనాన్ని గూర్చి చెప్పానని తెలుపుతూ ఓ శ్లోకం చదివారు.సందేశాత్మక చిత్రాల ద్వారా ప్రజలను మార్చేందుకు ప్రయత్నించామన్నారు. సినీ పరిశ్రమ ఆ బృహత్తరమైన బాధ్యతను నిర్వహించిందని బాలయ్య తెలిపారు. మహిళలపై దేశ వ్యాప్తంగా ఘోర ఘటనలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు పోలీసుల రూపంలో దేవుడే దిశ కేసులో నిందితులకు శిక్ష విధించారని బాలకృష్ణ పేర్కొన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications