సిఎం రేసులో లేనని బాలయ్య, కుటుంబ విభేదాల పైనా..

హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకులుడు బోయపాటి శ్రీను, ఇతర యూనిట్ సభ్యులు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. రాజమండ్రిలోని కుమారి థియేటర్లో అభిమానులతో కలిసి మాట్లాడారు. అంతకుముందు తుని మండలంలోని లోవ దేవస్థానంలోని తలుపులమ్మ తల్లిని బాలయ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, పూజ సామాగ్రి సమర్పించారు.
బాలయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. లెజెండ్ చిత్రం షూటింగుకు ముందు అమ్మవారిని దర్శించుకున్నానని, చిత్రం ఘన విజయం సాధించడంతో మళ్లీ అమ్మవారిని దర్శించుకున్నానని బాలయ్య చెప్పారు. కాగా, అంతకుముందు విశాఖలో మాట్లాడుతూ... తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందనన్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందని... చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సింహాచలంలో అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications