టీడీపీని ఢీకొట్టాలంటే, ఓసారి ఓడిపోయావ్ ఐనా: జగన్పై బాలకృష్ణ నిప్పులు
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టాలంటే కొండను ఢీకొట్టినట్లేనని హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ వైసీపీని హెచ్చరించారు.
విశాఖపట్నం: ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టాలంటే కొండను ఢీకొట్టినట్లేనని హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ వైసీపీని హెచ్చరించారు.
జగన్పై బాలకృష్ణ పరోక్ష వ్యాఖ్యలు, 'బాబును కాదు, పారడైజ్పై సవాల్ చెయ్,'
జగన్పై నిప్పులు
విశాఖపట్నంలో టీడీపీ యువత విభాగం నిర్వహించిన కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పైన ఆయన విరుచుకుపడ్డారు. జగన్పై నిప్పులు చెరిగారు.
ఎన్టీఆర్ ఎలా కష్టపడ్డారో బాబు అలా
గత ఎన్నికల్లో ఓటమిపాలైన జగన్ మరోసారి పాదయాత్రలు అంటూ జనం మధ్యకు వెళ్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు. మద్రాసుకు నీరు అందించేందుకు ఎన్టీఆర్ ఎలా కష్టపడ్డారో అదే విధంగా ఏపీకి నీరు అందించేందుకు చంద్రబాబు కష్డపడుతున్నారని చెప్పారు.
చంద్రబాబుకు మాత్రమే ఆ ఘనత
పట్టిసీమ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఆయన అపర భగీరుథుడు అన్నారు.
వారికి గుర్తింపు లభిస్తుంది
ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కష్టించి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని బాలకృష్ణ అన్నారు.