Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇప్లూ రేప్ కేసు: వీసితో దత్తాత్రేయ భేటీ (ఫోటోలు)

హైదరాబాద్: పోయిన వారంలో ఇప్లూ విద్యార్ధినిపై అత్యాచారం జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకునేందుకు గాను సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ బుధవారం ఇఫ్లూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సునీతా సింగ్‌ని కలిశారు.

అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. ఈ ఘటన ద్వారా మన దేశాన్ని పది సంవత్సరాలు వెన్కకి తీసుకెళ్లేదిగా ఉందని అన్నారు. మన ఎడుకేషన్ సిస్టమ్‌లో ఉన్నత విలువల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయాలని కోరారు.

బాధితురాలి తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో ఈ ఘటనను తలచుకుంటే బాధేస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పిల్లలు తలదించుకునే పనులు చేయకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఇలాంటి జరగకుండా తమ పిల్లలకు వ్యక్తిగతంగా తెలపాలన్నారు. బాధితురాలికి ప్రతి ఒక్కరూ తమ సంఘీభావాన్ని తెలపాలని ప్రత్యేకించి కోరుతున్నానని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇప్లూ విద్యార్ధిని రేప్.. అసుల ఏం జరిగింది:

 ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

పోయిన వారంలో ఇప్లూ విద్యార్ధినిపై అత్యాచారం జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకునేందుకు గాను సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ బుధవారం ఇఫ్లూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సునీతా సింగ్‌ని కలిశారు.

ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

దత్తాత్రేయ మాట్లాడుతూ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. ఈ ఘటన ద్వారా మన దేశాన్ని పది సంవత్సరాలు వెన్కకి తీసుకెళ్లేదిగా ఉందని అన్నారు. మన ఎడుకేషన్ సిస్టమ్‌లో ఉన్నత విలువల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయాలని కోరారు.

 ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

బాధితురాలి తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో ఈ ఘటనను తలచుకుంటే బాధేస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పిల్లలు తలదించుకునే పనులు చేయకుండా చూసుకోవాలన్నారు.

ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

ఇప్లూ రేప్ కేసు: వీసితో బండారు దత్తాత్రేయ భేటీ

ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఇలాంటి జరగకుండా తమ పిల్లలకు వ్యక్తిగతంగా తెలపాలన్నారు. బాధితురాలికి ప్రతి ఒక్కరూ తమ సంఘీభావాన్ని తెలపాలని ప్రత్యేకించి కోరుతున్నానని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థిని ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చి ఇఫ్లూలో ఎంఏ (ఇంగ్లిష్‌) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లో ఉన్న హాస్టల్‌లోనే ఉంటోంది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నితిన్‌ సోలసముద్రం(22) ఇక్కడే ఎంసీజే మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్టోబరు 31న క్యాంపస్‌లోని బషీర్‌ హాస్టల్‌లో ఉండే తన స్నేహితురాలి గదికి బాధిత విద్యార్థిని వచ్చింది. ఆమె ఇతరులతో కలిసి చదువుకుంటుండటంతో తిరిగి తన గదికి తిరిగి వెళుతోంది. ఈ సమయంలో ఇఫ్లూలోనే ఎంసీజే చదువుతున్న నితిన్‌ మెట్ల వద్ద ఎదురై ఆమెను తన గదికి తీసుకెళ్లాడు.

అప్పటికే ఆ గదిలో ఇఫ్లూలో ఎంసీజే పూర్తి చేసి బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ-2 బ్లాక్‌-8లో నివాసముంటున్న పశ్చిమ గోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన రాజసింహ(24) ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఆమెతో సిగరెట్‌ తాగారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగానే, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు.

మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమె, తన గదికి వెళ్లి తోటి విద్యార్థినులతో విషయాన్ని చెప్పింది. అందరూ కలిసి ఓ అధ్యాపకురాలి సాయంతో వర్సిటీ వీసీకి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించి, వారిలో నితిన్‌, రాజసింహపై ఐపీసీ 341, 376-జీ(నిర్భయ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+