యాజమాన్యానిదీ తప్పు: బియాస్ ట్రాజెడీపై నాయని
హైదరాబాద్: బియాస్ నది విషాద ఘటనలో కాలేజీ యాజమాన్యానిది కూడా తప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అన్నారు. విద్యార్థులతో సీనియర్ లెక్చరర్ను పంపించలేదని, టూరిస్టు గైడ్ లేకుండానే బియాస్ నది వద్దకు వెళ్లారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటనపై, చేపట్టిన గాలింపు చర్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రమాదానికి కారణాలను కూడా ఆయన వివరించారు.

ఏ విధమైన హెచ్చరికలు చేయకుండా డ్యాం అధికారులు నీళ్లు వదిలారని ఆయన తప్పు పట్టారు. అది ఓ తప్పు అయితే సీనియర్ లెక్చెరర్ విద్యార్థుల వెంట వెళ్లకపోవడంతో పాటు స్థానిక టూరిస్టు గైడ్ను ఏర్పాటు చేయకపోవడం మరో తప్పిదమని ఆయన అన్నారు
తాను హోం మంత్రి కాగానే ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని నాయని అన్నారు. విద్యార్థుల ఫీజులు తిరిగి ఇవ్వడానికి కళాశాల యాజమాన్యం అంగీకరించిందని ఆయన చెప్పారు. బ్యాంక్ రుణాలు ఉంటే కళాశాల యాజమాన్యమే చెల్లిస్తుందని ఆయన అన్నారు. మృతుల తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కళాశాల సీట్లు ఇస్తుందని ఆయన చెప్పారు.
ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా స్పందించిందని, డ్యాం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. హిమాచల్ ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications