వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాముడ్ని కాపాడుకుంటాం: మల్లుభట్టి, మనదని కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

chalam belongs to Telangana: Mallu Bhatti
న్యూఢిల్లీ/హైదరాబాద్: భద్రాచల రాముడిని, గిరిజన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క ఆదివారం అన్నారు. భద్రాచల రాముడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికే చెందుతారన్నారు. ముంపులేకుండా పోలవరం ప్రాజెక్టును నిర్మించికుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

భద్రాచలం ఎప్పుడు తెలంగాణదే అని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. గతంలో నిజాం రాజు రాముల వారికి తలంబ్రాలు పంపించే వారని, ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోందన్నారు. నిజాం తలంబ్రాలే ప్రస్తుతం మన ముఖ్యమంత్రులు మోస్తున్నారని చెప్పారు.

భద్రాచలం సీమాంధ్రలోనే: కావూరి

విభజన తప్పనిసరి అయితే భద్రాచలం డివిజన్ సీమాంధ్రలోనే ఉంటుందని కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు సమైక్య సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ సందర్భంగా కావూరి మాట్లాడారు. సీమాంధ్ర మంత్రులతో కలిసి మంత్రుల బృందానికి(జివోఎం)కు సమైక్యవాణి వినిపిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఖాయమన్నారు. భద్రాచలం సీమాంధ్రలోనే ఉంటుందన్నారు.

English summary
Depyty spekaker Mallubhatti Vikaramarka on Sunday said Bhadrachalam belongs to Telangana region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X