టీటీడీపై భూమన కుట్ర.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనిత
టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఎస్ వి గోశాలలో మూడు నెలల్లో 100 గోవులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా మహా పాతకం చోటుచేసుకుందని ఆయన అన్నారు . మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయని తెలిపారు.
టీటీడీపై భూమన ఆరోపణలు, ఖండించిన టీటీడీ చైర్మన్
దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. భూమన వ్యాఖ్యలను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మచ్చలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టిటిడి ఇటీవల కాలంలో చేస్తున్న మంచి పనులు చూసి కంటగింపుతో ఈ తరహా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రజలు వీటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

భూమన వ్యాఖ్యలపై మండిపడిన హోం మంత్రి అనిత
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుమల గోశాలలో 100 ఆవులు చనిపోయాయని ఆయన చేసిన వ్యాఖ్యలను వంగలపూడి అనిత ఖండించారు. కావాలని టీటీడీ పైన కుట్రలు చేస్తున్నారని అసత్య ప్రచారాలతో టిటిడి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అనిత మండిపడ్డారు.
టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు తీసుకున్న భూమన
టీటీడీకి సంబంధించిన ఎస్ వి గోశాలలో 260 మంది సిబ్బంది గో సంరక్షణ పనులు చేస్తున్నారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అక్కడ ఉన్న సుమారు 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసి మరీ పర్యవేక్షిస్తున్నారు అని వంగలపూడి అనిత వెల్లడించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేసాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
తిరుమల ఏడుకొండలు ఐదు కొండలుగా మార్చేందుకు కుట్ర చేశాడని, తిరుమలలో అన్యమత ప్రచారం జరగటానికి కారణం ఆయనేనని, ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి పైన చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదన్నారు వంగలపూడి అనిత.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications