Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓ గాడ్.. జస్ట్ మిస్.. హౌరా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం !

అహ్మదాబాద్ నుంచి హౌరా జంక్షన్ మధ్య నడిచే హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. రెడ్‌ క్లాత్‌ ద్వారా లోకోపైలట్‌ను సునీల్‌ అనే వ్యక్తి అప్రమత్తం చేశాడు. దాంతో ఆయన రైలును నిలిపివేశారు. పట్టాలు విరగడంతో ఆ మార్గంలో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

ఇక ఈ రైలు అహ్మదాబాద్ నుంచి ఉదయం 00:15 గంటలకు బయలుదేరి మూడవ రోజు మధ్యాహ్నం 13:30 గంటలకు హౌరా జంక్షన్ చేరుకుంటుంది. దాదాపు 2,087 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ ప్రయాణంలో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల గుండా వెళ్తుంది.

big-accident-was-avoided-by-the-howrah-express
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+