Vidadala Rajini: విడదల రజనీకి హైకోర్టులో భారీ ఊరట..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన విడదల రజనీకి కూటమి ప్రభుత్వంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా తాను మంత్రిగా ఉన్న సమయంలో డబ్బుల కోసం బెదిరింపులకు దిగిన ఓ ఘటనలో ఏసీబీ నమోదు చేసిన కేసును రజనీ ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఏసీబీ తాజాగా ఆమె మరిది గోపీనాథ్ ను అరెస్టు చేసింది. దీంతో రజనీ అరెస్టు కూడా ఖాయం అనుకుంటున్న సమయంలో ఆమెకు ఊరట లభించింది.
వైసీపీ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానాన్ని డబ్పుల కోసం బెదిరించిన వ్యవహారంలో విడదల రజనీతో పాటు ఆమె మరిది గోపీనాథ్ పై ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజనీతో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. తాజాగా ఇదే కేసులో మరిది గోపీనాథ్ అరెస్టు కావడంతో రజనీ అలర్ట్ అయ్యారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజిని దాఖలు చేసిన పిటిషన్ పై ఆమె తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. చివరికి ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. విడదల రజనీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు 41-ఎ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాదు ఏసీబీ విచారణకు సహకరించాలని రజినీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని విడదల రజనీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో రజినీ పీఏ రామకృష్ణకూ 41-ఎ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications