Amaravati : అమరావతిలో జగన్ కు భారీ ఊరట ! మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అదే సమయంలో అమరావతిలోనూ పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అమరావతిలో జగన్ సర్కార్ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా దానిపై వివాదాలు కూడా చెలరేగాయి. ఇలాంటి సమయంలో అమరావతి రాజధానిలో జగన్ సర్కార్ తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. హైకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించింది.
అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అక్కడి స్దానికులు వ్యతిరేకించినా, విపక్షాలు కోర్టులకు వెళ్లినా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దీనిపై ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత అక్కడ పేదలకు ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం మాత్రం ఆమోదముద్ర వేస్తూ కీలక నిర్ణం తీసుకుంది.

తాజాగా ఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు 47 వేల ఇళ్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేస్తూ కేంద్రం నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ అడిగిన నెల రోజుల్లోపే కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. వాస్తవానికి హైకోర్టు, సుప్రీంకోర్టులు గతంలో అమరావతిలో తుదితీర్పుకు లోబడి ఇళ్ల పట్టాల కేటాయింపు, వాటిలో ఇళ్ల నిర్మాణం ఉంటుందని చెప్పాయి. అయితే కేంద్రం మాత్రం అవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా ఈ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
అమరావతి ఆర్5 జోన్ లో పేదలకు 47 వేల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.705 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.5 లక్షలు ఇవ్వనుండగా.. రాష్ట్రం రూ.30 వేలు ఖర్చు చేయబోతోంది. ఇప్పుడు కేంద్రం ఈ మొత్తం ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేయబోతోంది.
-
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications