టిడిపికి అమిత్ షా షాక్: భేటీ వాయిదా, పొత్తుపై స్పష్టత లేనట్లే...
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో మంగళవారం బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తలపెట్టిన సమావేశం రద్దయింది. ఈ సమావేశం మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అయితే, తెలంగాణ బిజెపి నేతలు ఫిబ్రవరిర 1వ తేదీన అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.
టిడిపి పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, తోట నరసింహం మంగళవారంనాడు అమిత్ షాను కలవాల్సిందే. ఈ సమావేశంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లి స్పష్టత రాబట్టుకోవాలని టిడిపి ఎంపీలు అనుకున్నారు.

ఆ సమావేశం దానికైనా గానీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు డిలిమిటేషన్ బిల్లుకు సవరణలు చేయాల్సిన విషయంపై చర్చించేందుకు అమిత్ షా ఆ సమావేశాన్నితలపెట్టారు. అయితే, ఈ భేటీని అవకాశంంగా తీసుకుని రాష్ట్ర బిజెపి నేతల తీరును ఆయన దృష్టికి తేవాలని టిడిపి ఎంపీలు భావించారు.

వారికన్నా ముందు...
అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచే విషయంపై ముందుగా అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు. అలా చేస్తే పార్టీకి కలిగి లాభనష్టాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని భావించారు. ఆ తర్వాత టిడిపి నేతలతో సమావేశం కావాలని భావించారు.

వారి నుంచి ఒత్తిడి...
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెసుకోవాలని అమిత్ షా అనుకున్నారు.

సీట్లు ఇలా పెరుగుతాయి.
బిల్లుకు సవరణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సంఖ్య 119 నుంచి 153కు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నుంచి 225కు పెరుగుతుంది. సీట్ల సంఖ్య పెంపుపై ప్రధాని నరేంద్ర మోడీకి సిఫార్సు చేసే ముందు అమిత్ షా తమ పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications