బీజేపీకి జగన్ సరెండర్ ? లిక్కర్ కేసులో భారతి ! వారంలో పులివెందులలో-ఎమ్మెల్యే ఆది షాకింగ్.!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటివరకూ కడప జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన వైసీపి కూటమి సునామీలో దారుణ పరాజయాలు చవిచూసింది. కేవలం కడప, రాజంపేట, బద్వేలు సీట్లను మాత్రమే ఈసారి నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏం జరగబోతోందో ఆయన జోస్యం చెప్పేశారు.
త్వరలో వైసీపీ బీజేపీకి సరెండర్ అవుతుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే పులివెందులలో రాజకీయాలు మారబోతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో దోషుల్ని కూడా శిక్షిస్తామని ఆది ఇవాళ ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన దారుణ ఓటమి జగన్ పై తీవ్ర ప్రభావం చూపబోతోందని ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్ లో కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో జగన్ సతీమణి భారతి ప్రమేయంపై సైతం విచారణ చేయిస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. తద్వారా కవిత తరహాలోనే భారతిపై కూడా చర్యలు తప్పవనేలా ఆయన హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆది ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే కడప జిల్లాపై సాదించిన ఆధిక్యాన్ని సుస్ధిరం చేసుకునేందుకు బీజేపీ సహా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications