ప్రభుత్వం కిమ్మనట్లేదు, మీరైనా: చానళ్ల బ్యాన్పై బీజేపీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం కోరారు. బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ప్రసారాల నిలిపివేతకు ఎలాంటి కారణంలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించడంలేదని, ఎంఎస్వోలు చట్ట విరుద్ధంగా ప్రసారాలు నిలిపివేసినా కిమ్మనడంలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం మీరైనా జోక్యం చేసుకుని ప్రసారాలు ప్రారంభించేలా చూడాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.

కాగా, ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పందించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరింది. దీనిపై ఈనెల 19వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేరుగా ముఖ్యమంత్రికి కేసీఆర్కు లేఖ రాశారు.
తెలంగాణలో తమ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే తమ శాఖ సమాచార కార్యదర్శి లేఖ రాశారని, దీనికి సంబంధించిన వివరాలు తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారని, కానీ ఇప్పటిదాకా జవాబు రాలేదని, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని, కేబుల్ ఆపరేటర్లు/మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు అనధికారికంగా టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం ఈ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, అందువల్ల, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చూడాలని కేసీఆర్కు ప్రకాశ్ జవదేకర్ సూచించారు. కాగా జూన్ 24న ఈ లేఖ పంపించారని సమాచారం.
ప్రకాశ్ జవదేకర్ సమీక్ష
తెలంగాణలో టీవీ చానళ్ల నిలిపివేతపై తాను స్వయంగా లేఖ రాసి వారం గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆగ్రహించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తన శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపారు. అధికారులు కూడా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హైకోర్టుకు ఇచ్చిన నోటీసులపై ప్రతిస్పందించాల్సిన తీరుపై చర్చలు జరిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications