అసెంబ్లీని టిడిపి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా వాడుతోంది:బిజెపి ఎమ్మెల్సీ మాధవ్
విజయవాడ:ఎపికి అన్యాయంపై టిడిపి-బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో టిడిపి పై విమర్శనాస్త్రాలు సంధించారు.శాసన సభలో ప్రధాని మంత్రి క్లిప్పింగ్స్ చూపించడం సభ మర్యాదలు ఉల్లంఘించడమేనని మాధవ్ విమర్శించారు.శాసన సభను టీడీపీ వారు స్వప్రయోజనాల కోసం, స్వార్ధ రాజకీయాలు కోసం వాడుకుంటున్నారని...
అసెంబ్లీ ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా ఉపయోగించు కుంటున్నారని మాధవ్ ధ్వజమెత్తారు. మీ ప్రధాన మంత్రి అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను తీవ్రగా పరిగణిస్తున్నామని అన్నారు.చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని...సభలో లేని ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి ఇప్పుడు అక్కడ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రత్యేక హోదాపై అనేక సందర్భంల్లో మాట మార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ రూపంలో అసెంబ్లీలో తాము ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారా?...అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చిన వీడియో క్లిప్పింగ్స్, అలాగే
రుణమాఫీ, పిరాయిపులపై గతంలో చంద్రబాబు మాట్లాడినవి...ఇప్పుడు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ మీడియాకు ప్రదర్శించి చూపించారు. చంద్రబాబు పిరాయిపు రాజకీయాలపై గవర్నర్ కు పిర్యాదు చేస్తామని చెప్పారు.చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం పరిస్థితి కి తగ్గట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని,
హోదా కన్నా ప్యాకేజీనే బెటర్ అన్న సీఎం చంద్రబాబే ఇప్పడు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ వలన 15 సీట్లు కోల్పోయామంటున్న చంద్రబాబు గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన సంగతి మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.అసలు చంద్రబాబు పొత్తు లేకుండా ఒంటరిగా గెలిసిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు...ఎన్నికల్లోఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, దీంతో తనపై ఉన్న ప్రజా వ్యతిరేకతను మళ్ళిచేందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మాధవ్ చెప్పారు.
అసలు అమిత్ షా లేఖను ఎలా అసెంబ్లీలో ఎలా ప్రస్తావిస్తారని...షా ప్రశ్నల కు సీఎం సమాధానం చెప్పకుండా ప్రజలపై దాడిగా అభివర్ణించడం సిగ్గు చేటన్నారు.బీజేపీకి ఇచ్చిన సీట్ల లో రెబెల్స్ ను నిలబెట్టారని...టీడీపీ మిత్ర ధర్మానికి వెన్నుపోటు పొడిచిందన్నారు.ప్రజల నుంచి డబ్బులు తీసుకొని బ్యాంక్ ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తారని ప్రశ్నించారు...కాల్ మని సెక్స్ రాకెట్ లో ఇలాగే ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకొని టీడీపీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు.ప్రత్యక హోదా అనేది ముగిసిన అధ్యాయమని...ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications