One Nation-One Election :జమిలి ఎన్నికలపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు- నెక్స్ట్ అదే..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ నిన్న పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం మరింత వేగంగా అడుగులు వేయబోతోందని తెలిపోయింది. తమ హయాంలోనే జమిలి ఎన్నికల్ని నిర్వహించి తీరుతామని హోంమంత్రి అమిత్ షా కూడా తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జమిలి ప్రతిపాదనపై స్పందించారు.
జమిలి ఎన్నికలకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరి తెలిపారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. త్వరలో ఇది చేపడతామన్నారు. జమిలిలో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు అని పురందేశ్వరి పేర్కొన్నారు.

దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఎంపీ పురందేశ్వరి తెలిపారు. జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నామన్నారు. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలని ఆమె కోరారు. మరోవైపు యూఎస్ లో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తుందని పురందేశ్వరి విమర్శించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications