జగన్ పై దాడి...పలు అనుమానాలకు తావిస్తోంది:జివిఎల్; మంత్రి జవహర్ ఇతర నేతలు ఏమన్నారంటే?
విజయవాడ:ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్పై జరిగిన దాడిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఖండించారు. సురక్షితంగా భావించే ఎయిర్పోర్టులో దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
జగన్ పై దాడి గురించి తెలిసిన వెంటనే ట్విట్టర్ లో తన స్పందన పోస్ట్ చేశారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. దాడిపై వెంటనే జ్యుడిషియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. జగన్ పై జరిగిన దాడి గురించి మంత్రి జవహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివికావని అన్నారు. అయితే జగన్ పై ఎయిర్పోర్టులో దాడి జరగడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఎయిర్ పోర్టులో పెన్నును కూడా చెక్ చేస్తారని...అలాంటిది కత్తి లోపలికి ఎలా వెళ్లిందని మంత్రి జవహర్ ప్రశ్నించారు. కేంద్ర బలగాల ఆధీనంలో ఉండే ఎయిర్పోర్టులో...దాడి ఎందుకు జరిగిందో విచారణలో అన్ని నిజాలు తెలుస్తాయని అన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్టులో జరిగిన దాడి దారుణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డిలు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్పోర్టులో ఈ దాడి జరగడం నిఘా వైఫల్యమేనని, ఈ దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడిని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఖండించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తాయన్నారు.
బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మాట్లాడుతూ..."ఇటువంటి దాడులు దారుణం...ఇలాంటివాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి...కోళ్ల పందాలకు వాడే కత్తి పదును తీవ్రంగా ఉంటుంది...కుట్రపూరితంగా జరిగిందేమోనని అనుమానం కలుగుతోంది"...అని వ్యాఖ్యానించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications