ప్రాణహిత నదిలో పడవ బోల్తా, గల్లంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు..
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిని ఫారెస్ట్ అధికారులుగా గుర్తించారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొమ్రభీం జిల్లా చింతలమానేపల్లి గూడెం వద్ద గల ప్రాణహిత నదిలో ప్రమాదం జరిగింది.
నదిలో గల్లంతైన వారిని ఫారెస్ట్ బీట్ అధికారులుగా పోలీసులు గుర్తించారు. బాలకృష్ణ, సురేశ్ అనే బీట్ అధికారులు గల్లంతయ్యారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అహెరి నుంచి గూడెనికి నాటు పడవలో వస్తున్నారు. వీరితోపాటు మరికొందరు కూడా నాటు పడవలో ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

బాలకృష్ణ, సురేశ్.. కర్జవెల్లిలో బీట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం అహెరి నుంచి నాటు పడవలో గూడెనికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రం క్షేమంగా ఉన్నారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. బీట్ ఆఫీసర్ల గల్లంతుతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications