చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర: జగన్ వ్యాఖ్యలపై అనుమానం; టీడీపీనేత షాకింగ్ ఆరోపణ
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ భేటీకి ముందు పల్నాడు జిల్లా కేంద్రంగా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక పరిపాలన సాగుతుందని తాను మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అంతే కాదు హైదరాబాద్ లో ఉంటూ తనను విమర్శించే వారికి గుండెపోటు వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల హత్యకు కుట్ర.... బోండా ఉమా అనుమానం
జగన్ తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గొడ్డలి వేటుకు బలైతే, గుండెపోటు గా చిత్రీకరించారని, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటూ విమర్శించే వారికి గుండెపోటు వస్తుందని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల హత్యకు ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల వల్ల కలుగుతుందని బోండా ఉమా వ్యాఖ్యానించారు.

కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాలన్న బోండా ఉమా
గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించటంలో దిట్ట అయిన జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న బోండా ఉమా కేంద్ర నిఘా సంస్థలు దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై మాట్లాడిన బోండా ఉమ ఇప్పటి వరకు ఉన్న మంత్రుల రూపంలో దొంగలముఠా రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇక మంత్రివర్గ మార్పుతో గజ దొంగల ముఠా ప్రజలను పీడించబోతుంది అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం కోసమే మంత్రివర్గం మార్పు జరుగుతుందని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.

పీకే సర్వేతో జగన్ కు టెన్షన్
రాబోయే ఎన్నికలలో సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉందని పీకే సర్వే రిపోర్ట్ స్పష్టం చేయడంతో జగన్ కు టెన్షన్ పట్టుకుందని బోండా ఉమా వ్యాఖ్యానించారు. అందుకే జగన్ క్యాబినెట్ మార్చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బోండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలనపై పీకే సర్వే రిపోర్ట్ నేపథ్యంలో జగన్ కు చెమటలు పడుతున్నాయని బోండా ఉమా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని బోండా ఉమ విమర్శించారు.
Recommended Video

జగన్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలన్న బోండా ఉమా
జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా వల్ల మరణించిన మృతుల కుటుంబాలకు చంద్రబాబు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పవన్ కళ్యాణ్ తమ సొంత డబ్బులతో సహాయం అందించారని బోండా ఉమ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకునే జగన్ మంత్రులతో రాజీనామా చేయించటం కాదు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బోండా ఉమా సవాల్ విసిరారు. అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ అంతా వైసీపీలోనే ఉంది. ఈ దొంగల ముఠా రాష్ట్ర ప్రజల సంపదను దోచేస్తుంది అంటూ వైసీపీ ని టార్గెట్ చేశారు బోండా ఉమ.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications