పార్టీలోకి వస్తే చూసుకొని మాట్లాడాలి, అందులో జేసీ ఒకరు: బోండా ఉమ కౌంటర్
ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు చూసి మాట్లాడాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు బుధవారం నాడు అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విజయవాడ: ఇతర పార్టీల నుంచి వచ్చిన, వచ్చే నాయకులు చూసి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు బుధవారం నాడు అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చంద్రబాబును జేసీ దివాకర్ రెడ్డి ఏమన్నారంటే...
జేసీ దివాకర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఆ సమయంలో జేసీ తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం నుంచి పోటీ చేసి, ఎంపీగా గెలిచారు.
ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో జేసీ దివాకర్ రెడ్డి తన తరహాలోనే షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, మంగళవారం నాడు చంద్రబాబు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు కాస్త చూసుకొని మాట్లాడాలన్నారు. చంద్రబాబుకు పాలనలో అపార అనుభవం ఉందని చెప్పారు. అందుకే ఆయనకు ప్రజలు అధికారం కట్టబెట్టారని చెప్పారు. చంద్రబాబు అనుభవం చూసి వచ్చిన పలువురి నేతల్లో జేసీ దివాకర్ ఒకరు అన్నారు.త