మీడియాపై బొత్స గుర్రు: బాబుపై 'అగ్రి' ఆరోపణ
హైదరాబాద్: మీడియా వార్తల పట్ల ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెసు నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఊహాజనితమైన వార్తలు రాసి మనోభావాలను దెబ్బ తీయవద్దని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు. బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ సలహా ఇచ్చారు.
కాగా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ కుంభకోణంతో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన అనుచరులకు సంబంధాలున్నాయని బొత్స ఆరోపించారు. అందుకే అగ్రి గోల్డ్ కుంభకోణంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి, తన ఆలోచనల కోసం బేషజాలకు పోవడం మంచిది కాదని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసి కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని ఆయన అడిగారు. ఆయన ఎపికి చేసిందేమిటని అడిగారు. తన వాక్చాతుర్యంతో ప్రజల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు వస్తే ప్రజలే నిలదీస్తారని, ఎపికి వెంకయ్య నాయుడిని రానివ్వరని ఆయన అన్నారు.
-
ఏపీలో విషాదం : రాత్రంతా ఆన్ లోనే బైక్ ఇంజన్.. పొగ పీల్చి నలుగురు మృతి! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications