ప్రేమించడం లేదని బైక్తో ఢీకొట్టాడు: అమ్మకానికి పసికందు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నెల్లూరులోని హరినాథపురంలో తనను ప్రేమించాలంటూ సునీల్ అనే యువకుడు డీడీఆర్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నాడు.
అయితే దీనికి ఆ విద్యార్థిని నిరాకరించింది. దాంతో అతగాడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో మంగళవారం ఆ యువకుడు విద్యార్థినిని బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లాలో పసికందు విక్రయం జరిగింది. లక్ష రూపాయలకు పసికందును విక్రయించారు. ఈ ఘటన నాయుడుపేట మండలం కారుమంచు వారికండ్రిగలో జరిగింది.
ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్ అధికారులు పసికందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సూత్రధారి ప్రేవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లక్ష్మీకాంతమ్మ అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications