ఆరేళ్ల బాలుడి హత్య: పాతబస్తీలో రౌడీషీటర్ హత్య
పాత కక్షల కారణంగానే కరీంను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కరీంఖాన్ హత్య కేసుోల షాకీర్ తమ్ముళ్లు అన్వర్, ఇంతియాజ్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
హైదరాబాదులోని నార్సింగ్లో ఆరేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బాలుడ్ని అత్యంత కిరాతకంగా దుండగులు హతమార్చారు. బాలుడి ముఖాన్ని బండరాయితో మోది ఉరివేసి హత్య చేసారు. హతుడిని రాజ్కుమార్గా గుర్తించారు.
మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు దుండగులు పిరంచెరువు వద్ద పెట్రోల్ పోసి తగులబెట్టారు. సంఘటనా స్థలంలో ఉన్న స్కూల్ ఐడి కార్డు ఆధారంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అనంతరం బాలుడి బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బాలుడి హత్య కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనూప్, వినోద్ అనేవారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలే రాజ్కుమార్ హత్యకు కారణమని భావిస్తున్నారు.