వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్‌ను పప్పు ఎందుకంటారో చెప్పిన బుద్ధా, జగన్ ఆస్తులు రాసివ్వాలని..

మంత్రి నారా లోకేష్ చాలా మంచివాడని అందుకే ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పప్పు అంటున్నారేమోనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మంత్రి నారా లోకేష్ చాలా మంచివాడని అందుకే ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పప్పు అంటున్నారేమోనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

పప్పు అనేది బూతు కాదని చెప్పారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని, ఖజనా నిండగానే నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రతిక్ష నేత వైయస్ జగన్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. యాపిల్ కంపెనీని ఏపీకి తీసుకు వస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శించడం ఏమిటన్నారు.

Buddha Venkanna reveals why YSRCP calling Lokesh as pappu

జగన్ తన ఆస్తులను నిరుద్యోగులకు రాసివ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో యువతకు ఉద్యోగాల ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ తన తండ్రికి కూడా లేఖ రాయాలని చెప్పారు.

వందేళ్లు వచ్చే వరకు ఏపీని చంద్రబాబే పాలిస్తారని చెప్పారు. కృష్ణా నది కబ్జా విషయాన్ని తాను టీవీలో చూశానని, కబ్జాకు పాల్పడిన వారిలో తమ పార్టీ నేతలు ఎవరున్నా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు.

English summary
Telugudesam Party MLC Buddha Venkanna reveals why YSRCP calling Lokesh as pappu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X