తృటిలో తప్పిన పెను ప్రమాదం: బస్సు బోల్తా, ప్రయాణికులకు గాయాలు
విజయవాడ: విజయవాడ నగర శివార్లలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళుతున్నకాళేశ్వరి ట్రావెల్స్కు చెందిన బస్సు విజయవాడ సమీపంలో పైడురుపాడు వద్ద బోల్తా పడింది. ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ కారణంగా అడ్డ దారిలో వెళ్లటం తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ బస్సు ప్రయాణికులను ప్రయాణికులను గోలుపుడి తరలించి అక్కడ నుంచి వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించారు.













Click it and Unblock the Notifications