బాబు సమక్షంలో టిడిపిలోకి బుట్టా రేణుక కానీ ట్విస్ట్: జగన్ను దెబ్బతీసేందుకే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిశారు.

అమావాస్య కాబట్టి అధికారికంగా చేరిక వాయిదా
బుట్టా రేణుక టిడిపిలో చేరినట్లే. కానీ అధికారికంగా ఆమె ఇంకా చేరలేదు. రేపు అమావాస్య కావడంతో తెలుగుదేశం పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విదేశీ పర్యటన అనంతరం బుట్టా రేణుక అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

ప్రస్తుతానికి ఇలా.. పథకాలు నచ్చి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి పథకాలు నచ్చి చంద్రబాబును కలిసేందుకు వచ్చినట్లు బుట్టా రేణుక ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం టిడిపిలో చేరుతానని చెప్పారు.

జగన్ను దెబ్బతీసేందుకే వ్యూహం
చంద్రబాబు విదేశీ పర్యటన, అమావాస్య వంటి కారణాలు చెబుతున్నప్పటికీ బుట్టా రేణుక టిడిపిలో చేరిక వాయిదా పడటం వెనుక జగన్ పాదయాత్రను దెబ్బతీయడమే కారణంగా భావిస్తున్నారు. నవంబర్ 2వ తేదీన జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

వైసిపికి షాక్ తగిలినట్లవుతుందని
ఈ నేపథ్యంలో ఆ సమయంలో కొద్దిగా అటు ఇటు టిడిపిలో చేరితే వైసిపికి షాక్ తగిలినట్లవుతుందని భావిస్తున్నారు. జగన్ పైన చంద్రబాబు మైండ్ గేమ్ ప్రకారమే బుట్టా రేణుక తన చేరికను వాయిదా వేసుకున్నారని అంటున్నారు.
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications