కిరణ్ ఫోనెత్తడు, జగన్ దేశం తిరుగుతడు: బైరెడ్డి

బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ లాంటి వారికున్న జ్ఞానం వీళ్లకు లేకపోయిందన్నారు. కపటం లేని రాయలసీమ ప్రజలు ఎన్టీఆర్ అల్లుడనో(బాబు), వైఎస్ కొడుకనో(జగన్) వీళ్లకు ఓటెయ్యద్దని విజ్ఞప్తి చేశారు. చచ్చిపోయిన(సమైక్యాంధ్ర) దానికోసం బంద్లు చేయిస్తున్న ఈ ముగ్గురిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరిస్తే పట్టిన దెయ్యం వదులుతుందన్నారు.
రాయలసీమ నీటి సంగతి తేల్చకుండా పోలవరానికి జాతీయహోదా తీసుకుంటే సహించేది లేదని, కోల్పోయిన రాజధాని ఇవ్వకుంటే అగ్నిగుండమేనని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తుంగభద్ర నీటికి బోర్డు(ఆంధ్ర-కర్ణాటక వాటాల కోసం) ఉన్నట్లే శ్రీశైలం, నాగార్జునసాగర్ నీళ్లకు కూడా ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచ ఏయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలకు మాత్రమే బోర్డు వేసి చేతులు దులుపుకుంటే కుదరదని డ్యాములకు సైతం ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకొని శ్రీశైలానికి గ్రామీణ హోదా తెచ్చి సీమకు, తెలంగాణకు చిచ్చుపెడతారా? అని బైరెడ్డి ప్రశ్నించారు.
శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం తాము కోల్పోయిన రాజధానిని తిరిగి సీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఏర్పాటు చేయాలని, లేదంటే అగ్నిగుండమే నని హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఉంటే శ్రీకాకుళం వాళ్లకు దూరమవుతుందని కొందరు ఆంధ్ర నేతలు గళం విప్పుతున్నారని, చెన్నైకి కన్యాకుమారి, ముంబైకి గడ్చిరోలి, బెంగుళూరుకు బీదర్, తిరువనంతపురానికి కాసర్గోడ్ దగ్గర్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications