మీ త్యాగాలు వృధా కావు; రాజధాని అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ప్రస్తుతం 25 రోజులుగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. ఇక చంద్రబాబు కోసం టీడీపీ నాయకులు, అభిమానులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు కోసం పోరుబాట పట్టారు.
తాజాగా రాజమండ్రిలో నిజం గెలవాలి అంటూ ఆందోళన కొనసాగిస్తున్న నారా భువనేశ్వరిని రాజధాని అమరావతి ప్రాంత రైతులు కలిశారు.చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా, "నిజం గెలవాలి" అంటూ పోరాటం చేస్తున్న నారా భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలపాలని రాజమహేంద్రవరం బయలుదేరిన రాజధాని రైతులను, వీరవల్లి టోల్ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

రాజమండ్రి వెళ్ళటానికి అనుమతి లేదని రైతులు వెళ్తున్న బస్సులను నిలిపివేసి వారిని ఇబ్బందులకు గురిచేశారు. అయినా రాజమండ్రికి వెళ్ళిన అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరం వెళ్లి నారా భువనేశ్వరి గారిని కలిసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించారు.
ఎందుకు ఇంత భయం జగన్ ?
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2023
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా, "నిజం గెలవాలి" అంటూ పోరాటం చేస్తున్న నారా భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలపాలని రాజమహేంద్రవరం బయలుదేరిన రాజధాని రైతులను, వీరవల్లి టోల్ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు. రాజమండ్రి వెళ్ళటానికి అనుమతి లేదని రైతులు… pic.twitter.com/rNEXB7p5tB
ధైర్యంగా ఉండాలని, త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని రాజధాని ప్రాంత మహిళా రైతులు పలువురు నారా భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు కుటుంబానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడిన నారా భువనేశ్వరి రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్నారు.
రాజధాని అమరావతి రైతులు రాజమహేంద్రవరం వెళ్లి నారా భువనేశ్వరి గారిని కలిసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించారు#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu… pic.twitter.com/nLdSCkjRxP
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2023
రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాల గురించి చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని అన్నారు. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని నారా భువనేశ్వరి రైతులతో చెప్పారు. రాజధాని రైతులపై పెట్టిన కేసులు, కక్ష సాధింపు చర్యలు అన్నీ తనకు తెలుసు అన్న నారా భువనేశ్వరి రైతులు ధైర్యంగా నిలబడాలని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. అమరావతిన్ ప్రాంత రైతులు చంద్రబాబు కోసం కంటతడి పెట్టుకోవటంతో భువనేశ్వరి వారిని ఓదార్చారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications