మీ త్యాగాలు వృధా కావు; రాజధాని అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ప్రస్తుతం 25 రోజులుగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. ఇక చంద్రబాబు కోసం టీడీపీ నాయకులు, అభిమానులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు కోసం పోరుబాట పట్టారు.
తాజాగా రాజమండ్రిలో నిజం గెలవాలి అంటూ ఆందోళన కొనసాగిస్తున్న నారా భువనేశ్వరిని రాజధాని అమరావతి ప్రాంత రైతులు కలిశారు.చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా, "నిజం గెలవాలి" అంటూ పోరాటం చేస్తున్న నారా భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలపాలని రాజమహేంద్రవరం బయలుదేరిన రాజధాని రైతులను, వీరవల్లి టోల్ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

రాజమండ్రి వెళ్ళటానికి అనుమతి లేదని రైతులు వెళ్తున్న బస్సులను నిలిపివేసి వారిని ఇబ్బందులకు గురిచేశారు. అయినా రాజమండ్రికి వెళ్ళిన అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరం వెళ్లి నారా భువనేశ్వరి గారిని కలిసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించారు.
ఎందుకు ఇంత భయం జగన్ ?
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2023
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా, "నిజం గెలవాలి" అంటూ పోరాటం చేస్తున్న నారా భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలపాలని రాజమహేంద్రవరం బయలుదేరిన రాజధాని రైతులను, వీరవల్లి టోల్ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు. రాజమండ్రి వెళ్ళటానికి అనుమతి లేదని రైతులు… pic.twitter.com/rNEXB7p5tB
ధైర్యంగా ఉండాలని, త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని రాజధాని ప్రాంత మహిళా రైతులు పలువురు నారా భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు కుటుంబానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడిన నారా భువనేశ్వరి రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృధా కావన్నారు.
రాజధాని అమరావతి రైతులు రాజమహేంద్రవరం వెళ్లి నారా భువనేశ్వరి గారిని కలిసి ఆమెకు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించారు#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu… pic.twitter.com/nLdSCkjRxP
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2023
రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాల గురించి చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని అన్నారు. ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుందని నారా భువనేశ్వరి రైతులతో చెప్పారు. రాజధాని రైతులపై పెట్టిన కేసులు, కక్ష సాధింపు చర్యలు అన్నీ తనకు తెలుసు అన్న నారా భువనేశ్వరి రైతులు ధైర్యంగా నిలబడాలని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. అమరావతిన్ ప్రాంత రైతులు చంద్రబాబు కోసం కంటతడి పెట్టుకోవటంతో భువనేశ్వరి వారిని ఓదార్చారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications