జగన్పై సీబీఐ కోర్టు ఆగ్రహం: ఇలాంటివి రిపీట్ కావొద్దని హెచ్చరిక
అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్, విజయసాయిరెడ్డి గైర్హాజరుపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరుపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
గుంటూరులో పార్టీ ప్లీనరీ సమావేశం ఉన్నందున జగన్ విచారణకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Recommended Video

Nagarjuna Akkineni to Join YSRCP? Breaking News!
రాజకీయ కారణాలతో కోర్టుకు గైర్హాజరు కాకపోవడం సరికాదని.. మరోసారి ఇదే పునరావృతమైతే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని సీబీఐ కోర్టు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. అనంతరం తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications