ఆంధ్రప్రదేశ్లో సెల్ఫోన్ ధరలకు ఇక రెక్కలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్లపై వ్యాట్ను పెంచాలని నిర్ణయించింది. ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 4 రూపాయల చొప్పున పెంచింది. కొన్ని రాష్ట్రాలు వ్యాట్ రూపంలో సెల్ ఫోన్లపై 14.5 శాతం వసూలు చేస్తూ రెవన్యూను వసూలు చేసుకుంటున్నాయి.
ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని సెల్ ఫోన్లపై వ్యాట్ను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ వ్యాట్ 4,5 శాతం మాత్రమే ఇప్పటి వరకు ఉంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని ఎపి ఆర్థిక శాఖ వాణిజ్య పన్నుల శాఖకు సూచించింది. సెల్ఫోన్లపై వ్యాట్ను పది శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

అయితే, పేదలకు కొంత ఊరట కలిగించే విధంగా ఆ వ్యాట్ను పెంచాలని అనుకుంటోంది. 10 వేల రూపాయల పైబడి ఖరీదు చేసే సెల్ఫోన్లపై మాత్రం వ్యాట్ పెంచాలని అనుకుంటోంది. అయితే, దీనివల్ల అదనంగా ఎంత ఆదాయం సమకూరుతుందనే ఆంచనా ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదు.
మధ్యతరగతి ప్రజలు, పేదలు పది వేల రూపాయల లోపు ఖరీదు చేసే ఫోన్లను మాత్రమే కొంటారని, అందువల్ల వ్యాట్ పెంచడం వల్ల పేదలపై, మధ్యతరగతిపై భారం పడే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, రెవెన్యూను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications